'కేసీఆర్‌ కూపన్స్'తో ఎన్నారై విద్యార్థులకు సహాయం

గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీని వలన ప్రజలు ఆరోగ్యపరంగానే కాకుండా, నితావసరాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి ప్రభుత్వాలు అక్కడ వీలైనంత సహాయం చేస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్య్వక్తులు - సంస్థలు ఆపదలో ఉన్నవాళ్లకు వీలైనంత సహాయం చేస్తున్నారు, వారందరికీ టీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం  కృతఙతలు తెలియజేసింది. తెలుగు రాష్ట్రాల నుండి బ్రిటన్ కు  గత సంవత్సరం నుండి వెయ్యిల మంది విద్యార్థులు ఉన్నత చదువు కోసం వచ్చారు.  కరోనా మహమ్మారి వల్ల ఇక్కడ విద్యార్థులు వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఎన్నారై టీఆర్ఎస్ యూకే విభాగం వీలైనంత సహాయం చేస్తూ వారికి అండదండగా ఉందని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల తెలిపారు. 


టీఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ ' కెసిఆర్ కూపన్స్' పేరుతో సామాజిక దూరాన్ని పాటిస్తూ సుమారు 200 లకు పైగా విద్యార్థులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను వారి స్థానిక దుకాణాలల్లో తీసుకొనేలాగా ఏర్పాటు చేశామని  అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. కూపన్ ఆవిష్కరించి ప్రోత్సహించిన ఎంపీ సంతోష్ కుమార్ కు అశోక్ గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి  కెసిఆర్ స్ఫూర్తి  తో , మంత్రి కే.టీ.ఆర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రవాసులకు సహాయం చేస్తూ వారిలో మానసికస్థైర్యాన్ని నింపుతున్నామని వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.  ఎన్నారై తెరాస యూకే సభ్యులు గత నెల రోజుల నుండి స్థానికంగా నే కాకుండా క్షేత్రస్థాయిలో ఎంతోమందికి నిత్యావసరాలు అందించారని, యూకే లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ వారికి ఏదైనా సహాయం కావాలంటే మమ్మల్ని nritrs@gmail.com  ద్వారా  సంప్రదించవచ్చని సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.